హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకం కొనసాగుతుందని వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఆరోగ్య పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు. పరిపాలన సంబంధిత అంశాల్లో భాగంగానే సీఈవోను మార్చామని తెలిపారు. త్వరలో ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకానికి సీఈవోను నియమిస్తామని చెప్పారు. అదనంగా ఈవో గోపీనాథ్ను కూడా నియమిస్తున్నామని పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm