హైదరాబాద్: వచ్చేనెల 18వతేదీ నుంచి 22వరకు హైదరాబాద్లో సీపీఎం జాతీయ మహాసభలు జరగనున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. శనివారం ఆయన హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ... సీపీఎం జాతీయ మహాసభల్లో బీజేపీని ఎదుర్కొనే అంశాలపై చర్చిస్తామన్నారు. అలాగే తెలంగాణలో కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరూ సంతోషంగా లేరని, ఉద్యమాలు జరగకూడదన్నట్టుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని తమ్మినేని అన్నారు. 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పోటీ చేస్తుందని ఆయన తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm