న్యూఢిల్లీ : విద్య ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా, లైంగికవేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ అతుల్ జోహ్రీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ జేఎన్యూ విద్యార్థులు, ఉపాధ్యాయులు చేపట్టిన పార్లమెంట్ మార్చ్పై పోలీసులు విరుచుకుపడ్డారు.
గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న జేఎన్యూ విద్యార్థులు మాము చేస్తున్న ఆందోళనను ప్రభుత్వం,పోలీసులు నిమ్మకునీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారంటూ పార్లమెంట్ మార్చ్కు సిద్ధమయ్యారు. ఈ నిరసనప్రదర్శనలో పాల్గొనాలని జేఎన్యూ స్టూడెంట్ యూనియన్ పలు వర్సిటీల విద్యార్థులను కోరింది. దీంతో పలు వర్సిటీలకు చెందిన విద్యార్థులంతా భారీ సంఖ్యలో తరలివచ్చారు. జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థులు,ప్రొఫెసర్లు వర్సిటీ క్యాంపస్ నుంచి పార్లమెంటు వరకూ ర్యాలీ చేపట్టారు. మధ్యాహ్నం రెండుగంటలకు ర్యాలీ మొదలైంది. సుమారు రెండువేలకు పైగా విద్యార్థులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రదర్శన పార్లమెంట్ మార్చ్కు బయలుదేరటంతో.. పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. భారీగా వస్తున్న నిరసనకారులను రోప్ టీమ్లతో అడ్డుకునే ప్రయత్నం చేశారు. విద్యార్థులు పెద్ద ఎత్తున ప్రతిఘటించారు. పోలీసులు ఏకంగా వాటర్ కెనాన్స్ ఉపయోగించి విద్యార్థులను, ప్రొఫెసర్లను చెల్లా చెదురు చేశారు. అంతటితో ఆగకుండా విద్యార్థులు, ప్రొఫెసర్లపై మోడీ సర్కార్ పోలీసులు లాఠీచార్జీకి పాల్పడ్డారు. విద్యార్థినులని కూడా చూడకుండా లాఠీలను ఝులిపించారు. చదువుల చెప్పే గురువులపై పోలీసులు తమ ప్రతాపం చూపించారు. పోలీసుల దాడిలో పలువురు విద్యార్థులు, ప్రొఫెసర్లు తీవ్రంగా గాయపడ్డారు. 23 మంది విద్యార్థులను అరెస్టు చేసి స్థానిక లైసెన్సింగ్ కాలనీ డిఫెన్స్ యూనిట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్టు అయిన వారిలో ఎనిమిది మంది విద్యార్థినీలు కూడా ఉన్నారు. అరెస్టు చేసిన తరువాత కూడా పోలీస్ స్టేషన్లో పెట్టి చితకబాదారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Mar 24,2018 02:22PM