ఢాకా: బంగ్లాదేశ్లో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. మలేషియాకు వెళ్తున్న ఆ విమానం ఢాకా విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న 15 నిమిషాల తర్వాత అత్యవసరంగా దిగింది. ఉదయం 8.45 నిమిషాలకు టేకాఫ్ తీసుకున్న తర్వాత విమాన పైలట్కు తప్పుడు సంకేతాలు అందాయి. దీంతో అతను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. అప్పుడు యూఎస్ బంగ్లా ఎయిర్లైన్స్లో 168 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానాన్ని పూర్తిగా చెక్ చేసిన తర్వాత ఉదయం 11.45 నిమిషాలకు క్లియరెన్స్ ఇచ్చారు. ఆ తర్వాత విమానం మళ్లీ ఎగిరింది. ఈనెల 12వ తేదీన బంగ్లాదేశ్కు చెందిన విమానం ఖాట్మాండులో కూలిన ఘటనలో 49 మంది మృతిచెందిన విషయం తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm