హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే నెల 3న ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉన్నట్టు సమాచారం. రాజ్యసభ సభ్యుల ప్రమాణస్వీకారోత్సవంలో ఆయన పాల్గొంటారని తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన పలువురు జాతీయ నాయకులను కలిసే అవకాశం ఉంది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా కేసీఆర్ చేస్తోన్న ప్రయత్నాల నేపథ్యంలో ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకోనుంది. తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెరాస అభ్యర్థులు బండ ప్రకాశ్ ముదిరాజ్, బడుగుల లింగయ్య యాదవ్, జోగినపల్లి సంతోష్కుమార్ గెలుపొందిన విషయం తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm