హైదరాబాద్ : వెల్నెస్ కేంద్రాలు యథావిధిగా పని చేస్తాయి.. ఆరోగ్యశ్రీలో కలపడం లేదని స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ, వెల్నెస్ కేంద్రాలు ప్రజారోగ్యంలో రెండు వేర్వేరు సేవా కేంద్రాలు అని మంత్రి తెలిపారు. వెల్నెస్ కేంద్రాల్లో మందుల కొరత త్వరలో తీరుతుందన్నారు. ఇప్పటి వరకు 4 వెల్నెస్ కేంద్రాలు పని చేస్తున్నాయని గుర్తు చేశారు. మరో 4 వెల్నెస్ కేంద్రాల ఏర్పాటు పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. మిగతా చోట్ల కూడా వెల్నెస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm