మైసూర్ : కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకున్న నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాలను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి తప్పుపట్టారు. శనివారం ఆయన మైసూర్లో ఓ కాలేజీ విద్యార్థినులతో మాట్లాడారు. నోట్ల రద్దు, జీఎస్టీలు భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాయన్నారు. నోట్ల రద్దు ఓ తప్పుడు నిర్ణయమని భావిస్తున్నానని, ఆర్థిక వ్యవస్థకు, ఉద్యోగ కల్పనను అది దెబ్బతీసిందని, ఆర్బీఐ గవర్నర్, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్, ఆర్థిక మంత్రులకు నోట్ల రద్దుపై అవగాహన లేదని, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం.. నోట్ల రద్దును ఓ పిచ్చి చర్యగా అభివర్ణించారని రాహుల్ పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm