ఢిల్లీ : నైజీరియాలో నెల రోజుల క్రితం బోకో హరామ్ ఉగ్రవాదులు 100 మంది బాలికలను ఓ స్కూల్ నుంచి అపహరించారు. ఈశాన్య రాష్ట్రమైన యోబో నుంచి వాళ్లను అపహరించుకుపోగా..ఎట్టకేలకు వారిని తీవ్రవాదులు రిలీజ్ చేశారు. అపహరణకు గురయిన బాలికలను దేశరాజధాని అబుజలోని దేశాధ్యక్ష కార్యాలయంలో నైజీరియా అధ్యక్షుడు మొహమ్మద్ బుహరి కలిశారు. అనంతరం అపహరించిన బాలికలందరినీ ఉగ్రవాదులు ఎటువంటి షరతులు లేకుండానే విడిచిపెట్టటం విశేషం.
Mon Jan 19, 2015 06:51 pm