పాట్నా: నిత్యం వివాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తాజాగా లాలూ జైలు శిక్షపై తనదైన శైలిలో స్పందిచారు. 'చేసిన కర్మకు ఫలితం అనుభవించక తప్పదు... చట్టం తన పని తాను చేసింది. ఇది ఏదో ఓ పార్టీ ఇచ్చిన తీర్పు కాదు. దీనిపై మాట్లాడదల్చుకోలేదు...' అని పేర్కొన్నారు.
దాణా కుంభకోణానికి సంబంధించిన నాలుగో కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్కు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఇవాళ రాంచీ కోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పటికే మరో మూడు దాణా కుంభకోణం కేసుల్లో దోషిగా తేలిన లాలూ.. 13.5 ఏళ్ల జైలు శిక్ష ఎదుర్కొంటున్నారు. తాజాగా ఏడేళ్ల జైలు శిక్ష పడడంతో లాలూకి మొత్తం 20 సంవత్సరాలకు పైగా శిక్ష పడినట్టైంది. ప్రస్తుతం లాలూ ప్రసాద్ యాదవ్ రాంచీలోని బిస్రా ముండా సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Mar 24,2018 04:09PM