అమరావతి: సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ కంటే బీజేపీనే ఎక్కువ మోసం చేసిందని ప్రజల్లో బలంగా ఉందని, విభజన హామీలపై కేంద్రం సమీక్ష జరపలేని స్థితిలో ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. విభజన చట్టంలో పెట్టినవే ఇవ్వమన్నామని, ఇవ్వాల్సినవి ఇవ్వకుండా వక్రీకరిస్తూ లేఖలు రాస్తారా అంటూ ప్రశ్నించారు. ప్రజలు కట్టిన పన్నుల్లోంచే రాష్ట్రానికి వాటా ఇస్తున్నారని, కేంద్ర విద్యాసంస్థలకు రూ.11672 కోట్లు అవసరమైతే 576 కోట్లు ఇచ్చారని చెప్పారు. కేంద్ర విద్యాసంస్థలకు రూ.11584 కోట్ల విలువైన భూములు ఇచ్చామని ఈ సందర్భంగా బాబు గుర్తుచేశారు.
Mon Jan 19, 2015 06:51 pm