న్యూఢిల్లీ: కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానంపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయాధ్యక్షుడు అమిత్ షా స్పందించారు. కాంగ్రెస్కు దమ్ముంటే పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఆయన సవాల్ విసిరారు. శనివారం గౌహతిలో ఒక ర్యాలీలో పాల్గొన్న ఆయన పై విధంగా స్పందించారు. బీజేపీ ప్రభుత్వం అన్నింటికి సిద్ధంగా ఉందన్నారు. అవిశ్వాస పరీక్షలో తలపడేందుకు తమకు పూర్తి స్థాయి మెజార్టీ ఉందన్నారు. మరోవైపు ప్రతిపక్షాలు సభాను సజావుగా సాగనివ్వకుండా అనేక సమ్యసలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. అయితే తాము సభలో అన్ని సమస్యలపై చర్చిందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కానీ సభ సజావుగా నడవకుండా ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని అమిత్ షా అన్నారు. ఇదిలావుంటే ఇప్పటివరకు తెదేపా, వైకాపా కేంద్ర ప్రభుత్వంపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలకు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ ఈసారి తానే స్వయంగా రంగంలోకి దిగింది. ఈ మేరకు ఆ పార్టీ లోక్సభాపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ కార్యాలయానికి పంపారు. మంగళవారం సభా కార్యకలాపాలకు సంబంధించిన జాబితాలో తమ అవిశ్వాస నోటీసును చేర్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm