న్యూఢిల్లీ: దేశీయ తయారీ రంగాన్ని అభివృద్ధి పరచడం కోసం ప్రభుత్వం దేశంలోకి దిగుమతి అయ్యే టీవీ ప్యానెల్స్పై సుంకాన్ని కుదించింది. ఈ మేరకు శనివారం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్(సీబీఈసీ) అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఓపెన్ సెల్(15.6్ణ్ణ అంగుశాలు, అంతకంటే ఎక్కువ) ఎల్ఈడీ, ఎల్సీడీ (లెడ్) టెలివిజన్స్లో ఉపయోగించే ప్యానెల్స్పై దిగుమతి సుంకాన్ని 5శాతానికి చేసినట్టు సీబీఈసీ వెల్లడించింది. దిగుమతి సుంకాన్ని తగ్గించడం వల్ల దేశంలో తయారయ్యే ఎల్ఈడీ, ఎల్సీడీ టీవీల విభాగాన్ని ఎంతో ప్రోత్సహించినట్లవుతోందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక నుంచి ఆయా విడిభాగాలపై 5శాతం మేర మాత్రమే సుంకాన్ని వసూలు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. గతంలో 7.5శాతంగా ఉన్న కస్టమ్స్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రభుత్వం దీనిని 15శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించింది. ఇప్పుడు ఈ సుంకాన్ని5శాతానికి తగ్గించింది.
Mon Jan 19, 2015 06:51 pm