అమరావతి: ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపణలపై మంత్రి లోకేష్ స్పందించారు. నీళ్ల టాంకర్ల విషయంలో అవినీతి జరిగిందని, సోమువీర్రాజు ఆరోపణలు చేయడం సరికాదని హితవుపలికారు. వాటర్ ట్యాంకర్ల విషయంలో అవినితి జరిగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 'ఏం జరిగినా నా డ్యాష్ బోర్డులో కనిపిస్తాయి. ఉపాధి హామీ నిధుల్లో అవినీతి జరిగితే 20 అవార్డులు ఎందుకు వస్తాయి?. బీజేపీ పాలిత రాష్ట్రాలలో అవార్డులు ఎందుకు రాలేదు?. రోజుకు 15గంటలు కష్టపడుతున్నా.. అవినీతి ఆరోపణలు బాధ కలిగిస్తున్నాయి. ప్రతి చిన్న విషయానికీ అవినీతి అనడం సరికాదు. తప్పులుంటే బీజేపీ నేతలు చెప్పండి.. సరిచేసుకుంటా' అని లోకేశ్ కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm