హైదరాబాద్: శాసనసభ పలు పద్దులకు ఆమోదం తెలిపిన అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి ప్రకటించారు. రేపు ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమవుతుందని డిప్యూటీ స్పీకర్ తెలిపారు. శాసనసభ ఆమోదించిన పద్దుల్లో.. పరిశ్రమలు, ఐటీ, హోం, కార్మికశాఖ పద్దులు, దేవాదాయ, అటవీ శాఖ పద్దు, రాష్ట్ర డీజీపీ, ఎంపిక, నియామక బిల్లు, అసైన్డ్ భూముల చట్ట సవరణ బిల్లు, పీజీ వైద్య విద్యార్థుల చట్టసవరణ బిల్లు, తెలంగాణ అడ్వకేట్స్, క్లర్క్స్, వెల్ఫేర్ ఫండ్ చట్టసవరణ బిల్లు, పదో తరగతి వరకు తెలుగు బోధనచ, అధ్యయన నిర్బంధ చట్ట బిల్లులు ఉన్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm