సూర్యాపేట: సూర్యాపేట గ్రామీణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ లవకుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. ట్రాఫిక్ కానిస్టేబుల్ దామోదర్ రెడ్డి పీఎస్లో నిన్న పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ విషయం తెలిసిందే. కానిస్టేబుల్పై ఎస్ఐ చేయి చేసుకున్నారనే ఆరోపణ. ఈ ఘటనపై నల్లగొండ ఎస్పీ విచారణ చేసి నివేదిక సమర్పించారు. ఎస్పీ విచారణ ఆధారంగా ఎస్ఐను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఐజీ నిర్ణయం వెలువరించారు.
Mon Jan 19, 2015 06:51 pm