చీరాల: ప్రకాశం జిల్లా చీరాల ర్తెల్వేస్టేషన్లో విషాదం చోటుచేసుకుంది. కదులుతున్న రైలు ఎక్కబోయి శుక్రవారం రాత్రి ఇంజినీరింగ్ విద్యార్థి ర్తెలు కిందపడి మృతిచెందిన సంఘటన సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. గుంటూరు జిల్లా బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న కె. వెంకటశివ(18) అనే యువకుడు చెన్నెలో జరగనున్న ఎడ్యుకేషనల్ ఫెయిర్కు వెళ్ళేందుకు బాపట్ల నుంచి శుక్రవారం అర్ధరాత్రి చెన్నె ఎక్స్ ప్రెస్ ర్తెలులో ప్రయాణిస్తున్నాడు. చీరాల ర్తెల్వేస్టేషన్లో ఆగిన ర్తెలు దిగి మంచినీటి సీసా కొనుక్కోన్నాడు. ఆ క్రమంలో ర్తెలు కదిలింది. అప్పటికే వేగం అందుకున్న ర్తెలు ఎక్కే ప్రయత్నం చేయగా ప్రమాదవశాత్తు జారి ర్తెలు కిందపడి మృతిచెందాడు. ప్రమాద దృశ్యాలు సీసీ టీవీలో నమోదయ్యాయి. మృతుడు ప్రకాశంజిల్లా దర్సి మండలం కామాంతపూడి గ్రామానికి చెందిన వెంకట శివగా గుర్తించారు.
Mon Jan 19, 2015 06:51 pm