అమరావతి: భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్షాకు ఆంధ్రప్రదేశ్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. నాలుగేళ్లుగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అవినీతి జరిగి ఉంటే చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో అభివృద్ధి భాజపా, తెదేపా వ్యవహారమేమీ కాదన్నారు. పార్లమెంట్లో చేసిన నిర్ణయాల అమలుపై ఏమైనా గౌరవం ఉంటే భాజపా తక్షణమే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm