హైదరాబాద్ : కాన్పూర్ జిల్లాలో కల్తీ మద్యం తాగి 10 మంది మృతి చెందిన కేసులో 11 మందిని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. కల్తీ మద్యం సేవించడంతో మరొక 16 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించారు. ఉత్తర్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి దినేశ్ శర్మ ఉర్సులా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు.
Mon Jan 19, 2015 06:51 pm