తిరుమల : శ్రీవారి ఆలయంలో జరుగతున్న పరిణామలు భక్తుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ పరిణామాలపై సీఎం చంద్రబాబుకు మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు మరోసారి బహిరంగ లేఖ రాశారు. టీటీడీ పూర్వ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు లేవనెత్తిన అంశాలపై విచారణ అవసరమని, ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తగు చర్యలు తీసుకోవాలని కోరారు. పోటు ప్రాంతంలో తవ్వకాలు జరిపై అధికారం ఎవ్వరికీ లేదని, పురావస్తు శాఖ తనిఖీకి, ఈ చర్యకు సంబంధం ఉండొ ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. పోటు ప్రాంతంలో తవ్వకంపైనా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి వ్యవస్థ, ప్రభుత్వంలోని లోపాలను తెలిపే వ్యక్తులకు భద్రత ఉండాలని తన లేఖలో చంద్రబాబును కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm