బెంగళూరు: కర్నాటకలో కాంగ్రెస్, జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వం ఐదేండ్లు అధికారంలో ఉంటుందా? అని అడిగిన మీడియా ప్రశ్నపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రశ్నకు జవాబు కాలమే చెప్తుందని ఆయన పేర్కొన్నారు. నేను ఇప్పుడు ఏమీ చెప్పలేను. మా ముందు పలు అంశాలు, ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడే నేనేమీ చెప్పలేను్ణఅంటూ ఆయన సమాధానాన్ని దాటవేశారు.
Mon Jan 19, 2015 06:51 pm