న్యూఢిల్లీ: గుజరాత్లోని రాజ్కోట్లో ఓ దళితుడిని కొట్టి చంపారు. అతన్ని తాడుతో కట్టేసి.. ఇనుప రాడ్లతో కొట్టారు. దెబ్బలకు తట్టుకోలేక అరుస్తూ అతను మృతిచెందాడు. ఓ ఆటోపార్ట్స్ అమ్మే సంస్థ ఓనర్ ఆదేశాల మేరకు కొందరు ఆ దళితుడిని చావబాదారు. అతని భార్యను కూడా తీవ్రంగా కొట్టినట్లు తెలుస్తోంది. దెబ్బలకు బలైన వ్యక్తిని ముకేశ్ వానియాగా గుర్తించారు. ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ ఆ ఘటనకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ఈ కేసులో ఫ్యాక్టరీ ఓనర్తో పాటు అయిదుగుర్ని అరెస్టు చేశారు. మర్డర్తో పాటు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. అయస్కాంతాలు వాడుతూ ఇనుప చెత్త కోసం వెతుకుతున్న క్రమంలో దళిత జంటపై ఆటో ఫ్యాక్టరీ ఓనర్ దాడి చేయించినట్లు తెలుస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm