అనంతపురం : వైసీపీ నేత జగన్ పై మంత్రి పరిటాల సునీత మండిపడ్డారు. దొంగలకు అధికారమిస్తే రాష్ట్రాన్ని దోచేయడం ఖాయమని మహిళాశిశు సంక్షేమశాఖ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. మండల కేంద్రమైన గార్లదిన్నెలో ఆదివారం శింగనమల నియోజకవర్గ మినీ మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పరిటాల సునీత పాల్గొన్న ఆమె అధికార దాహంతో జగన్ లేనిపోని హామీలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఆ యన మాయమాటలు నమ్మి ఓట్లు వేస్తే పూర్తిగా దోచేస్తారన్నారు. బడుగు, బలహీనవర్గాలకు అండగా నిలుస్తున్న ఎందరో మహానుభావులను కోల్పోవాల్సి వస్తుందన్నారు. ఈ బాధలు కాంగ్రెస్ హయాంలో అనుభవించామని గుర్తుచేశారు.
Mon Jan 19, 2015 06:51 pm