భోపాల్ : ఏపీ ఏసీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. మధ్యప్రదేశ్లోని బిర్లానగర్ రైల్వేస్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. ఎక్స్ప్రెస్లోని నాలుగు ఏసీ బోగీలు పూర్తిగా కాలిపోయాయి. ఈ బోగీల్లో ఉన్న 36 మంది ట్రైనీ ఐఏఎస్లు సురక్షితంగా బయటపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తుంది. ఢిల్లీ నుంచి వైజాగ్ వస్తుండగా బిర్లా నగర్ రైల్వేస్టేషన్ వద్ద రైలులో మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm