శ్రీకాకుళం: పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు లేక ఆడపిల్లలు చదువులు మధ్యలో ఆపేస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో రెండో రోజు పర్యటిస్తున్న పవన్ కల్యాణ్ మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. భద్రత లేక ఆడపిల్లలకు త్వరగా పెళ్లి చేస్తున్నారన్నారు. నెలసరి సమస్యలకు కూడా వైద్యం దొరకడం లేదని పేర్కొన్నారు. ఆడ పిల్లలకు సమస్యలు ఉండవద్దన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మహిళా వైద్యులు ఉండాలన్నారు. ప్రతి పంచాయతీలో ప్రైమరీ హెల్త్కేర్ సెంటర్, స్కూల్ ఉండాలన్నారు. అధికార వికేంద్రీకరణ జరగాలన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm