రాయ్పూర్: ఛత్తీస్గఢ్లోని దంతెవాడలో నిన్న జరిగిన మావోయిస్టుల ఐఈడీ పేలుళ్లలో మృతి చెందిన సీఏఎఫ్ బెటాలియన్కు చెందిన కానిస్టేబుల్ రాజేశ్ కుమార్ మృతదేహం పాట్నా విమానాశ్రయానికి చేరుకుంది. ఇదే దాడిలో మరణించిన డీఎఫ్ బలగాలకు చెందిన హెడ్కానిస్టేబుల్ రామ్కుమార్ యాదవ్ మృతదేహాన్ని ఆయన కుటుంబసభ్యులకు అందజేశారు. వీరి అంత్యక్రియలు జరగాల్సి ఉంది. ఛత్తీస్గఢ్ దంతేవాడ జిల్లాలోని బచేలిఉచోల్నార్ రోడ్డు నిర్మాణ పనులకు గస్తీ నిర్వహిస్తున్న బలగాల వాహనాన్ని మావోయిస్టులు నిన్న మందుపాతరతో పేల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఏడుగురు జవాన్లు దుర్మరణం చెందారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- May 21,2018 02:57PM