చిత్తూరు: వయసొచ్చిన బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే.. కామంతో ఆమె జీవితాన్ని నాశనం చేశాడు. మూడేళ్లుగా భార్య సహకారంతో.. కుమార్తెపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి గ్రామంలో వెలుగు చూసింది. చంద్రగిరికి చెందిన ఓ వ్యక్తి వృత్తిరీత్యా డ్రైవర్. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. కుమార్తె డిగ్రీ పూర్తి చేసి.. ఉద్యోగ ప్రయత్నంలో ఉంది. అయితే గత మూడేండ్ల నుంచి తనపై అత్యాచారం చేస్తున్నాడని ఇటీవలే బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. చెప్పినట్లు వినకుంటే దారుణంగా కొట్టేవాడని బాధితురాలు కన్నీరు పెట్టుకుంది. తన తల్లి కూడా నాన్నకే మద్దతుగా ఉండేదని పేర్కొంది. విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తామని తల్లిదండ్రులు ఇద్దరు బెదిరించే వారని బాధితురాలు పోలీసులకు చెప్పింది. ఒక వేళ విషయం బయటకు తెలిస్తే.. నాన్న జైలుకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. విషయం బయట ఎవరికీ చెప్పొద్దని తల్లి తనను బెదిరించేదని ఆమె తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm