మధ్యప్రదేశ్: ప్రయాణికులతో వెళ్తోన్న బస్సు, ట్రక్కు ఢీకొనడంతో సోమవారం మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మంది మరణించగా, 47 మంది గాయపడ్డారు. పోలీసులు కథనం ప్రకారం.. బాందా నుంచి అహ్మదాబాద్ వెళ్తోన్న ప్రయాణికుల బస్సు ట్రక్కును ఢీకొనడంతో ఓ చిన్నారి సహా 10 మంది మృతి చెందారు. మృతుల్లో బస్సు డ్రైవర్ కూడా ఉన్నాడు. ఏడుగురు ఘటనా స్థలంలోనే మృతి చెందగా, మరో ముగ్గురు చికిత్స పొందుతూ మరణించారు. మరో 47 మందికి గాయాలయ్యాయి. మధ్యప్రదేశ్లోని గుణా జిల్లాకు 15 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను వెంటనే దగ్గర్లో ఉన్న జిల్లా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm