శ్రీకాకుళం: జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా సోమవారం సోంపేటలో యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా థర్మల్ప్లాంట్ అమరవీరుల స్థూపం వద్ద పవన్ నివాళి అర్పించారు. అనంతరం థర్మల్ పోరాట కుటుంబాలతో ఆయన ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని ధ్వంసం చేస్తే జనసేన అంగీకరించదన్నారు. పర్యావరణాన్ని కాపాడే అభివృద్ధి కావాలని పవన్ కళ్యాణ్ అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm