న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రష్యాలో పర్యటిస్తున్నారు. భారత్, రష్యాల మధ్య సత్సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ఆయన ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో సోచీలో భేటీ అయ్యారు. అలాగే, వారి మధ్య ఉగ్రవాదం, సిరియా, ఆఫ్ఘన్లో అశాంతి అంశాలపై కూడా చర్చ కొనసాగుతోంది.
ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ... షాంఘై సహకార సంస్థలో భారత్ శాశ్వత సభ్యత్వం పొందడానికి రష్యా ప్రధాన పాత్ర పోషించిందని అన్నారు. భారత్, రష్యాల మధ్య చాలా కాలంగా స్నేహం ఉందని పేర్కొన్నారు. సోచీలో చర్చలకు తనను ఆహ్వానించినందుకుగానూ పుతిన్కి కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- May 21,2018 05:41PM