న్యూఢిల్లీ: కర్నాటకలోని తాజా రాజకీయ పరిస్థితులపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కాంగ్రెస్ సీనియర్నాయకులు ఆశోక్ గెహ్లాట్, కెసి వేణుగోపాల్తో పాటు తాను(గులాం నబీ అజాద్) కలిసి వివరించినట్టు అజాద్ తెలిపారు. కర్నాటక ముఖ్యమంత్రిగా బుధవారం హెచ్డీ కుమారస్వామి ప్రమాణ స్వీకరాం చేయనున్న నేపథ్యంలో ఆయన ఇవాళ ఢిల్లీకి చేరుకున్న వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కుమారస్వామి రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. రాష్ట్ర భవిష్యత్తు కార్యాచరణపై వీరు ఇరువురు ఈ భేటీ సందర్భంగా చర్చించనున్నట్టు సమాచారం.
Mon Jan 19, 2015 06:51 pm