న్యూఢిల్లీ: ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్ పెద్దలతో చర్చించేందుకు కర్ణాటక కాబోయే ముఖ్యమంత్రి కుమారస్వామి సోమవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. యూపీ మాజీ సీఎం మాయావతిని ఆయన కలుసుకున్నారు. ఈ సందర్భంగా కుమారస్వామికి మాయావతి అభినందనలు తెలిపారు. కాసేపట్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియాతో కుమారాస్వామి భేటీ కానున్నారు. పదవుల పంపకంపై చర్చలు జరపనున్నారు. ఇప్పటికే కేబినెట్ కూర్పుపై కర్ణాటకలోని ఇరు పార్టీల నేతల మధ్య జోరుగా చర్చ జరుగుతోంది. రెండు పార్టీల మధ్య కొంచెం గ్యాప్ ఏర్పడినట్లు ప్రచారం జరిగింది. అయితే కాంగ్రెస్, జేడీఎస్ మధ్య సంబంధాలు బాగున్నాయని కుమారస్వామి స్పష్టం చేశారు. సోనియా, రాహుల్తో జరిగే చర్చల్లో సిద్ద రామయ్య, మాజీ మంత్రులు డీకే శివకుమార్, పరమేశ్వర్ కూడా పాల్గొననున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm