హైదరాబాద్: రవీంద్రభారతిలో సివిల్స్ ర్యాంకర్లతో పోటీపరీక్షలకు హాజరయే అభ్యర్థులకు ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి స్పీకర్ మధుసూదనాచారి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో అత్యంత అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. సివిల్స్ ర్యాంకర్లు కాబోయే అధికారులంటూ శానసమండలి స్వామిగౌడ్ వారిని కుర్చీలో కూర్చోబెట్టి గౌరవించారు. సివిల్స్ ర్యాంకర్లు ముందు కూర్చోగా..స్పీకర్ మధుసూదనాచారి, చైర్మన్ స్వామిగౌడ్, బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఆయాచితం శ్రీధర్, బీసీ కమిషన్ సభ్యులు, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం తదితరులు వారి వెనకవైపు నిలబడి అరుదైన గౌరవాన్ని అందించారు.
Mon Jan 19, 2015 06:51 pm