న్యూఢిల్లీ: కర్నాటక ముఖ్యమంత్రిగా జేడీఎస్ల్పీ నేత కుమారస్వామి బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంట్లో భాగంగా ఆయన సోమవారం ఢిల్లీలో బహుజన్ సమాజ్వాదీ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయవతిని కలిసి పుష్పగుచ్ఛం అందించి ప్రమాణ స్వీకరానికి రావాలని ఆహ్వానం పలికారు. ఇవాళ ఉదయం ఢిల్లీకి వచ్చిన ఆయన ఇప్పటికే పలువురు ముఖ్యనేతలతో పాటు కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలుసుకున్నారు. కర్నాటకలో కాంగ్రెస్, జేడీఎస్ల నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కానుంది.
Mon Jan 19, 2015 06:51 pm