విజయవాడ: కర్ణాటకలో అప్రజాస్వామిక చర్యలకు బీజేపీనే బాధ్యత వహించాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ లేనప్పటికీ గాలి జనార్థన్ రెడ్డితో బేరసారాలు జరిపారన్నారు. బేరసారాల టేపుల విషయంలో కేసులు నమోదుచేయాలన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన మంత్రి యనమల టీడీపీ మహానాడు సహా, కర్ణాటక రాజకీయాలపై స్పందించారు. గాలి జనార్థన్ రెడ్డి బీజేపీ చర్యలపై జగన్ ఎందుకు మాట్లాడటం లేదు? అని ప్రశ్నించారు. కర్ణాటక రాజకీయాలపై ఎందుకు స్పందించడం లేదంటూ పవన్ను సైతం నిలదీశారు. కర్ణాటకలో గాలి జనార్థన్ రెడ్డి, ఏపీలో జగన్.. బీజేపీకి లెఫ్ట్, రైట్ అని వ్యాఖ్యానించారు.
Mon Jan 19, 2015 06:51 pm