హైదరాబాద్: ఆఫ్ఘనిస్థాన్లోని జలాలాబాద్లో ఓ క్రికెట్ స్టేడియంలో రెండు రోజుల క్రితం జరిగిన బాంబు వరుస బాంబు పేలుళ్లలో 8 మంది మృతి చెందారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రంజాన్ కప్లో భాగంగా నిర్వహిస్తున్న మ్యాచ్ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియానికి తరలివచ్చారు. అందరూ ఉత్సాహంగా మ్యాచ్ను చూస్తున్న సమయంలో ఒక్కసారిగా పేలుళ్లు సంభవించాయి.
ప్రపంచ నంబర్ వన్ టీ20 బౌలర్ రషీద్ ఖాన్ సొంత ప్రావిన్స్ అయిన నంగార్హర్ ప్రావిన్స్లో జరిగిన ఈ ఘటనలో రషీద్ స్నేహితుడు దుర్మరణం పాలయ్యాడు. రషీద్ ఖాన్ ప్రస్తుతం ఐపీఎల్లో హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. బాంబు పేలుళ్లలో చనిపోయిన వారిలో రషీద్ స్నేహితుడైన హిదయతుల్లా జహీర్ కూడా ఉన్నాడు. విషయం తెలిసిన రషీద్ ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపాడు. ''బ్రదర్ నిన్ను మిస్సయ్యా. నంగర్హార్ సిటీ వెలిగిపోవాలని చాలా కష్టపడ్డావ్. నీ ఆత్మ శాంతించుగాక'' అని ట్వీట్ చేశాడు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- May 21,2018 07:52PM