పెద్దపల్లి: లంచం కోసం వేధించిన వీఆర్వో కొమురయ్య అధికారులకు అడ్డంగా చిక్కాడు. రైతు వద్ద నుంచి 20 వేలు లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ ఎం కిరణ్కుమార్ వివరాల ప్రకారం.. జిల్లాలోని ఓదెల మండలం కొమిరె గ్రామానికి చెందిన మూల ప్రేంసాగర్రెడ్డి, మీర్జంపేటకు చెందిన ఉయ్యాల కొమురయ్య వద్ద రెండెకరాల 6గుంటల భూమి (సర్వేనెంబర్ 46) 1996లో కొనుగోలు చేశాడు. కానీ, పట్టా చేయించుకోలేదు. తన పేరు మీద పట్టామార్పిడి చేసుకునేందుకు సాదాబైనామా ద్వారా 2016 సంవత్సరంలో దరఖాస్తు చేసుకున్నాడు. దీనిని పరిశీలించి పట్టాలు చేయాల్సిన మొట్లపల్లి వీఆర్వో దాసరి కొమురయ్య లంచం అడగడంతో పది నెలల క్రితం రూ.18 వేలు ఇచ్చాడు.
ప్రభుత్వం చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన కింద పట్టా మార్పిడి కాగా, రైతుబంధు కింద పట్టాదారు పాస్ పుస్తకంతో పాటు చెక్కు వచ్చింది. వారం క్రితం ఆ పాస్ పుస్తకం, చెక్కు ఇవ్వాలని సదరు రైతు వీఆర్వోను అడుగగా మరో రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అన్ని డబ్బులు తనవద్ద లేవని రైతు ప్రేంసాగర్రెడ్డి వేడుకున్నాడు. అయినా వినకపోవడంతో.. రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సలహా మేరకు డబ్బులు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. సోమవారం వీఆర్వో కొమురయ్య కాల్వశ్రీరాంపూర్లోని తన ప్రైవేట్ కార్యాలయంలో రైతు నుంచి 20 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. వీఆర్వోను అరెస్ట్ చేసి హైదరాబాద్ ఏసీబీ కోర్టులో హాజరుపరుచనున్నారు. డీఎస్పీ వెంట ఏసీబీ సీఐలు జీ వెంకటేశ్వర్లు, సీహెచ్ వేణుగోపాల్, బీ సంజీవ్ సిబ్బంది ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- May 21,2018 08:26PM