హైదరాబాద్: ఏపీ ప్రభుత్వంపై కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఆప్మెల్ను ఏపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చూస్తోందని కేంద్రానికి ఫిర్యాదు చేసింది. సింగరేణికి ఏపీ హెవీ మిషనరీ అండ్ ఇంజినీరింగ్ లిమిటెడ్ (ఆప్మెల్)లో 81.54 శాతం వాటా ఉందని, విభజన చట్టాన్ని తప్పుగా అన్వయించారని తెలంగాణ సర్కార్ ఆరోపిస్తోంది. షెడ్యూల్ 9లో వున్న సంస్థల విషయంలో వివాదాలపై కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది.
Mon Jan 19, 2015 06:51 pm