హైదరాబాద్: గురుకుల ప్రిన్సిపల్ ప్రశ్నాపత్రం వివాదంపై టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. గురుకుల ప్రిన్సిపల్ పరీక్షలో ఇచ్చిన 67ప్రశ్నలను తొలగించాలని నిర్ణయించింది. పేపర్-1లో 12, పేపర్-2లో 55 ప్రశ్నలు తొలగించినట్లు ప్రకటించింది. ప్రైవేటు బ్లాగులోని పలు ప్రశ్నలు ఈ పరీక్షలో యథాతథంగా వచ్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అభ్యర్థుల ఫిర్యాదు మేరకు టీఎస్పీఎస్సీ విచారణ చేపట్టి చర్యలు తీసుకుంది. ప్రశ్నాపత్రం రూపొందించిన ఎగ్జామినర్పై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
Mon Jan 19, 2015 06:51 pm