హైదరాబాద్: గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేయడమే కాకుండా అధికారాన్ని కేంద్రీకృతం చేసుకుని టీఆర్ఎస్ ప్రభుత్వం పాలన సాగిస్తోందని కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క ఆరోపించారు. గ్రామ పంచాయతీల పదవీ కాలం పూర్తికావొస్తున్నా ఇప్పటికీ నిధులు విడుదల చేయకపోవడం బాధాకరమన్నారు. సర్పంచులను భయపెట్టి గ్రామపంచాయతీలకు వచ్చే నిధులను కూడా కొల్లగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా సర్పంచులు, ప్రజాప్రతినిధులు ఏకం కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm