హైదరాబాద్: మద్యం మత్తులో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...మన్సూరాబాద్ డివిజన్ వినాయకనగర్ కాలనీలో నివసిస్తున్న కుసుకుంట్ల శ్రీకాంత్(30) గతంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసి మానేశాడు. ఇంటి వద్దనే ఉంటున్న అతడు రోజూ మద్యం తాగి తల్లి, చెల్లినీ తిడుతున్నాడు. ఆదివారం రాత్రి కూడా అతిగా మద్యం తాగి ఇంటికెళ్లగా తల్లి, చెల్లి మందలించగా కిరోసిన్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికంగా గల ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి చనిపోయినట్టు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm