హైదరాబాద్ : ఎర్లీ బర్డ్ ఆఫర్లో భాగంగా ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే రెట్టింపు ఆస్తిపన్ను వసూలు చేసినందుకు జీహెచ్ఎంసీతోపాటు తెలంగాణలోని ఇతర పట్టణ స్థానిక సంస్థలను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 67 మునిసిపాల్టీలు 80 శాతం కంటే ఎక్కువ పన్ను వసూలు చేయడం సంతోషంగా ఉందని ట్విట్టర్లో పేర్కొన్నారు. స్థానిక సంస్థలు ఆర్థిక సమృద్ధి సాధించినప్పుడే అభివృద్ధి దిశగా అడుగులు పడతాయని గతంలోనే పలుమార్లు ఆయన పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm