పశ్చిమబెంగాల్: ప్రధాన మంత్రి నరేంద్రమోడీ మరోసారి పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కోపం తెప్పించారు. దీనికి కారణం ఎప్పుడూ వస్తున్న సంప్రదాయాన్ని ఆయన కొనసాగించకపోవడమే. విశ్వభారతి యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమం ఈ రోజు ఉదయం జరిగింది. ప్రధాని మోడీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, పశ్చిమబెంగాల్ రాష్ట్ర సీఎం మమతాబెనర్జీ దీనికి హాజరయ్యారు. నిజానికి ఈ సందర్బంగానే యూనివర్సిటీ తరఫున గౌరవ పురస్కారమైన 'దేశికోత్తమ్'ను ప్రముఖులకు ప్రదానం చేయాల్సి ఉంది. కానీ, ఆ కార్యక్రమం జరగలేదు. ప్రధానమంత్రి కార్యాలయం అందుకు అనుమతి ఇవ్వలేదు. ప్రధాని బిజీ షెడ్యూల్ ను కారణంగా చూపించారు. అమితాబచ్చన్ సహా పలువురికి ఈ పురస్కారం ఇవ్వాలని ఇటీవలే యూనివర్సిటీ అకడమిక్ కౌన్సిల్ నిర్ణయించింది. ఈ పేర్లను కేంద్ర మానవవనరుల శాఖకు పంపించగా, అక్కడి నుంచి ఎటువంటి సమాచారం రాలేదని యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ సబూజ్ కాలి సేన్ తెలిపారు. అయితే, దీనిపై మమతా బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm