హైదరాబాద్: పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా ఎల్బీస్టేడియంలో క్రికెట్ లీగ్ మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు సిటీ పోలీసులు. సిటీ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని ఐదు జోన్లలో ఇప్పటికే టోర్నమెంట్స్ నిర్వహించిన పోలీసులుౌ వాటిల్లో విన్నర్ టీమ్స్ తో ఎల్బీ స్టేడియంలో లీగ్ మ్యాచ్ లను నిర్వహిస్తున్నారు. కర్టన్ రైజర్ మ్యాచ్ ను హీరో వెంకటేష్, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ త్రివేదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సీపీతో పాటు ఐదు జోన్ల పోలీసులు పాల్గొన్నారు. ఇవాళ్టి నుంచి జరిగే లీగ్ మ్యాచ్ లు జూన్ 3తో ముగుస్తాయి.
Mon Jan 19, 2015 06:51 pm