మెల్బోర్న్: బాల్ టాంపరింగ్ వివాదంలో చిక్కుకొని నిషేధానికి గురైన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ త్వరలోనే క్రికెట్ ఫీల్డ్లో అడుగుపెట్టబోతున్నాడు. కెనడాలో జరగబోయే గ్లోబల్ టీ20 ఈవెంట్లో స్మిత్ ఆడనున్నాడు. మార్కీ ప్లేయర్స్ జాబితాలో స్మిత్ చోటు సంపాదించాడు. జూన్ 28 నుంచి ఈ టోర్నీ ప్రారంభమవనుంది. క్రిస్ గేల్, ఆండ్రీ రసెల్, షాహిద్ అఫ్రిదిలాంటి ఇంటర్నేషనల్ స్టార్స్ ఈ టోర్నీలో ఆడుతున్నారు.
టోర్నీలో మొత్తం ఆరు టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్లో బాల్ టాంపరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణపై స్మిత్పై ఏడాది నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే ఆస్ట్రేలియా బయట జరిగే దేశవాళీ టోర్నీల్లో ఆడేందుకు ఈ మధ్యే క్రికెట్ ఆస్ట్రేలియా స్మిత్కు అనుమతి ఇచ్చింది. బాల్ టాంపరింగ్ వివాదంలోనే వార్నర్పై 12 నెలలు, బాన్క్రాఫ్ట్పై 9 నెలల నిషేధం విధించిన విషయం తెలిసిందే.
డ్వేన్ బ్రేవో, లసిత్ మలింగ, క్రిస్ లిన్, డారెన్ సామి, డేవిడ్ మిల్లర్, సునీల్ నరైన్లు కూడా మార్కీ ప్లేయర్స్ లిస్ట్లో ఉన్నారు. క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధం విధించడంతో ఐపీఎల్లో ఆడే అవకాశాన్ని కూడా స్మిత్, వార్నర్ కోల్పోయారు. ఈ కెనడా టోర్నీలో పాల్గొననున్న మొత్తం ఆరు టీమ్స్లో ఐదు కెనడాకు చెందినవే కాగా.. ఒకటి క్రికెట్ వెస్టిండీస్ టీమ్ ఉంటుంది.
వచ్చే వారంలో డ్రా తీసి ఎవరెక్కడ ఆడతారో నిర్ణయిస్తారు. కరీబియన్ ఆల్స్టార్స్, టొరంటో నేషనల్స్, మాంట్రియాల్ టైగర్స్, ఒటావా రాయల్స్, వాంకూవర్ నైట్స్, విన్నీపెగ్ హాక్స్ టీమ్స్ ఈ టోర్నీలో ఆడుతున్నాయి. మొత్తం 22 మ్యాచ్లు ఉంటాయి. జులై 16న ఫైనల్ జరుగుతుంది. టొరొంటో దగ్గర్లోని మాపుల్ లీఫ్ క్రికెట్ క్లబ్లో అన్ని మ్యాచ్లు జరుగుతాయి. ఈ స్టేడియం కెపాసిటీ కేవలం ఏడు వేలు మాత్రమే.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- May 25,2018 03:32PM