న్యూఢిల్లీ: పాకిస్థాన్ క్రికెటర్లకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అవినీతి నిధోక అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై మైదానంలో ఆటగాళ్లు ఎవరూ యాపిల్ స్మార్ట్వాచ్లు ధరించవద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని పాక్ ఆటగాడు హసన్ అలీ ధ్రువీకరించాడు. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో పాక్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్ జరుగుతోంది. గురువారం ప్రారంభమైన ఈ మ్యాచ్లో తొలి రోజు కొందరు ఆటగాళ్లు యాపిల్ వాచి ధరించి ఆడినట్టు ఐసీసీ అవినీతి నిరోధకశాఖ విభాగానికి చెందిన ఓ అధికారి గుర్తించారు. పాక్ మేనేజ్మెంట్కు ఆ వెంటనే ఆదేశాలు జారీ చేస్తూ ఇకపై ఆటగాళ్లు ఎవరూ మైదానంలో స్మార్ట్ వాచ్లు ధరించరాదని అల్టిమేటం జారీ చేశారు. నిజానికి ఇంటర్నెట్తో అనుసంధానమయ్యే ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులను మైదానంలోకి అనుమతించరు. ఆటగాళ్లు మైదానానికి చేరుకోగానే బస్సు నుంచి దిగిన వెంటనే ఫోన్లతోపాటు ఇతర వస్తువులను అక్కడికి సిబ్బందికి ఇచ్చేయాల్సి ఉంటుంది. అయితే, గురువారం కొందరు పాక్ ఆటగాళ్లు యాపిల్ స్మార్ట్ వాచ్లు పెట్టుకుని మైదానంలో కనిపించారు. ఇటువంటి వాచీలను పెట్టుకోవడం వల్ల ఆటగాళ్లను బుకీలు సంప్రదించే అవకాశం ఉందని, తద్వారా మ్యాచ్ ఫిక్సింగ్స్ జరిగే అవకాశాలున్నాయని ఐసీసీ పేర్కొంది. అందుకే ఇకపై ఆ వాచీలు ధరించి రావొద్దని ఆదేశించినట్టు వివరించింది.
Mon Jan 19, 2015 06:51 pm