బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీలో కుమారస్వామి బల నిరూపణ సందర్భంగా ప్రతిపక్ష నేత బీఎస్ యెడ్యూరప్ప ఘాటైన విమర్శలు చేశారు. గౌడ కుటుంబ సభ్యులను చీల్చి చెండాడారు. గతంలో గౌడలతో కలిసి పనిచేసినందుకు తాను చాలా చింతిస్తున్నానని అన్నారు. దేవెగౌడ, కుమారస్వామి గౌడలు బీజేపీకి నమ్మకద్రోహం చేశారని, ఇప్పుడు మీకూ అదే గతి పడుతుందని కాంగ్రెస్ను హెచ్చరించారు. గౌడ కుటుంబసభ్యులపై ఇప్పటికే ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయని ఆయన విమర్శించారు.
24 గంటల్లోగా కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వం రైతులకు రుణ మాఫీ చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు నిర్వహిస్తామని యెడ్యూరప్ప హెచ్చరించారు. కాంగ్రెస్తో చేతులు కలిపినందుకు జేడీఎస్ను చూసి ప్రజలు నవ్వుతున్నారని ఆయన అన్నారు. ఈ అపవిత్ర కలయికపై మరోసారి ఆలోచించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సూచించారు. తన ప్రసంగం తర్వాత బీజేపీ వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించి మొత్తం 104 మంది ఎమ్మెల్యేలు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. బీజేపీ వాకౌట్ చేయడంతో మూజువాణి ఓటుతో కుమారస్వామి ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- May 25,2018 04:12PM