న్యూఢిల్లీ: తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు రిలయన్స్ జియో మరో సరికొత్త ఆఫర్ ప్రకటించింది. ఐపీఎల్-11, 2018 ఫైనల్ మ్యాచ్ కోసం ఈ కొత్త ఆఫర్ అందిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. రూ. 101 రీచార్జి చేసుకుంటే 4జీ స్మార్ట్ఫోన్లకు 4 రోజులపాటు ప్రతి రోజు 2జీబీ డేటాను వాడుకోవచ్చని జియో ప్రకటించింది. గత నెలలో రూ. 251 ప్లాన్ను జియో ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ కింద 51 రోజులపాటు 4జీ స్మార్ట్ఫోన్లకు ప్రతి రోజు 2జీబీ డేటాను ఉపయోగించుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ల కోసం ఈ ఆఫర్ ప్రకటించినట్లు సంస్థ తెలిపింది.
Mon Jan 19, 2015 06:51 pm