హైదరాబాద్: అక్కినేని నాగార్జున కథానాయకుడిగా నటించిన చిత్రం ఆఫీసర్ రామ్గోపాల్ వర్మ దర్శకత్వం వహించారు. మైరా శరీన్ ఈ చిత్రంతో కథానాయికగా పరిచయం కాబోతున్నారు. కావ్య అనే చిన్నారి నాగార్జున కుమార్తెగా కనిపించబోతోంది. కంపెనీ సంస్థపై వర్మ ఈ సినిమా నిర్మాణ బాధ్యతల్ని కూడా చూసుకుంటున్నారు. జూన్ 1న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నహాలు చేస్తున్నారు.
కాగా మే 28న ఆఫీసర్ ప్రీ-రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వర్మ తెలిపారు. ఎన్ కన్వెన్షన్లో సాయంత్రం 7 గంటలకు వేడుక ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు. నాగార్జున అభిమానులను ఆహ్వానిస్తున్నా.. దయచేసి ఈ సెలబ్రేషన్స్లో పాల్గొనండి అని వర్మ ట్వీట్ చేశారు. ఇటీవల ఈ సినిమా పాట వీడియోను విడుదల చేశారు. నవ్వే నువ్వు.. అని సాగే ఈ పాటకు మంచి స్పందన లభించింది. యూట్యూబ్లో మొత్తం 3.4 లక్షల మంది ఈ పాటను వీక్షించారు. మే 22 విడుదలైన ఈ పాట ఇప్పటికీ ట్రెండింగ్లో ఉండటం విశేషం.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- May 25,2018 05:11PM