మహబూబాబాద్: తనను నమ్మించి మోసం చేసిన భర్తకు అతని భార్య నడి రోడ్డుపై దేహశుద్ధి చేసింది. పెళ్లి చేసుకుని ఆరేళ్లు కాపురం చేసి తర్వాత పత్తా లేకుండా పోయిన భర్తను అందరిముందు ఉతికి ఆరేసింది. చెప్పులతో కొడుతూ పరుగెత్తించింది. మూడేళ్ల నుంచి తప్పించుకుని తిరగడమేకాకుండా మరో మహిళను పెళ్లి చేసుకున్న విషయం తెలియడంతో పోలీసులకు పిర్యాదు చేసింది. అయితే కేసు వాపసు తీసుకోవాలంటూ వచ్చిన భర్తను స్థానికుల సాయంతో చితక్కొట్టింది. మహబూబాబాద్ జిల్లా కె.సముద్రమండలం, మహబూబ పట్టణానికి చెందిన కావేరి అనే గిరిజన మహిళను హసన్పర్తికి చెందిన వెంకన్న 9 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. ఆరేళ్లు కాపురం చేసిన వెంకన్న తర్వాత కనిపించకుండాపోయాడు. ఈలోపే తన భర్త మరో మహిళను పెళ్లి చేసుకున్నాడని తెలియడంతో కావేరి పోలీసులకు పిర్యాదు చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm