రాజ్కోట్ : ఓ వ్యక్తిని బెదిరించి లంచం డిమాండ్ చేసిన ఇద్దరు పోలీసులను గుజరాత్ ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఏఎస్ఐ భావనబెన్ ఓ మహిళ భర్తను నకిలీ కేసులో ఇరికిస్తామని బెదిరించారు. కేసులో ఇరికించకుండా ఉండాలంటే తమకు రూ.లక్ష లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో బాధిత మహిళ గమారా అనే మధ్యవర్తి సాయంతో రూ.25 వేలు ఇస్తానని ఒప్పుకుంది. మొదటి విడతగా రూ.10వేలు ఏఎస్ఐ భావనబెన్కు అందజేసింది. ఆ తర్వాత బాధిత మహిళ ఏసీబీ అధికారులకు సమాచారమందించింది. ఏఎస్ఐ భావనబెన్, కానిస్టేబుల్ గోవింద్ గజియా రెండో విడత రూ.15 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm